తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీరాభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఆ వీరాభిమాని ఎక్కడి వాడో కాదు.. మన తెలంగాణకు చెందినవాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన వాడు. కొన్నె‌కు చెందిన బుస్సా కృష్ణ(40) నేటి ఉదయం మృతి చెందాడు. ట్రంప్‌కు కృష్ణ వీరాభిమాని. దీంతో తన గ్రామంలోనే ట్రంప్ విగ్రహాన్ని పెట్టి కృష్ణ పూజలు నిర్వహిస్తున్నాడు.

కాగా.. కృష్ణ తనకు వీరాభిమాని అన్న విషయం తెలుసుకున్న ట్రంప్.. ఇండియాకు వచ్చినప్పుడు కృష్ణను కలుస్తానని ట్విట్టర్‌ వేదికగా గత ఏడాది వెల్లడించారు. అయితే ఆ తరువాత ఆయన ఇండియాకు వచ్చినప్పటికీ కృష్ణను కలవలేదు. కృష్ణ మాత్రం ఒక్కసారైనా తనకు ట్రంప్‌ను కలవాలని చెబుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని.. ఈ క్రమంలోనే గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.

More News

హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది..

‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది. గతంలో అనిత తల్లికాబోతోందంటూ ఎన్నో సార్లు వార్తలొచ్చాయి.

ఫ్రస్టేషన్.. చిరాకు, కోపం వచ్చేవి: రాశి ఖన్నా

సక్సెస్‌తో సంబంధం లేకుండా రాణించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది రాశీఖన్నాయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు.

సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు.