కుమార్తె పెళ్లి సంబంధం కోసం వెళ్తూ.. అమెరికాలో తెలుగు వారి మృతి

  • IndiaGlitz, [Monday,November 30 2020]

అమెరికాలో కుమార్తె వివాహ సంబంధం కోసం ఓ తెలుగు వారికి చెందిన కుటుంబం బయల్దేరింది. అంతే కొన్ని క్షణాల్లోనే కుటుంబంలోని ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు విషయంలోకి వెళితే.. నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పటేల్‌ నర్సింహారెడ్డి (57).. హైదరాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని టెక్సాస్‌లో ఉంటున్నారు.

మూడు నెలల క్రితం నర్సింహారెడ్డి ఆయన భార్య లక్ష్మి (50)తో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే నివాసముండే యువకుడితో కుమార్తె‌కు వివాహం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అబ్బాయిని కలిసేందుకు నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు తమ కుమారుడు భరత్‌కుమార్‌ రెడ్డి (24), కుమార్తె మౌనికతో కలిసి కారులో బయల్దేరారు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం టెక్సాస్ నగరంలోనే కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నర్సింహారెడ్డి, లక్ష్మి, భరత్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మౌనికతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం పెద్ద చింతకుంట గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సొంత గ్రామానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More News

గెస్ట్‌గా కిచ్చా సుదీప్ ఎంట్రీ.. ఈ వారం అంతా సేఫ్..

‘సోగ్గాడే చిన్ని నాయనా’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. హోస్ట్ నాగార్జున సాంగ్స్ మెడ్లీతో కంటెస్టెంట్‌లంతా ఇరగదీశారు.

కొత్త ఏటిటిలో డిసెంబ‌ర్ 18న విడుద‌ల అవ్వ‌బోతున్న 'డ‌ర్టీ హ‌రి'

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ద ఫాదర్ ఆఫ్ OTT’

తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారికి ఉన్న ఇమేజ్ గురించి కానీ.. ప్రత్యేకత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 

హోరాహోరీగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఒక పార్టీ స్ఫూర్తిగా తీసుకోవడం..

సింగర్ సునీత పెళ్లిపై మళ్ళీ గుసగుసలు

టాలీవుడ్‌లో సునీత ప్రముఖ సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.