పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తమన్..

  • IndiaGlitz, [Thursday,August 13 2020]

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలో సినీ పరివ్రమ ఒకటి. దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఐదు నెలలుగా సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో దీనిపై ఆధారపడిన ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల రెండు తెలుగు ప్రభుత్వాలు షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో చిన్న చిన్న సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. పెద్ద సినిమాలు మాత్రం షూటింగ్‌కు నోచుకుకోవడం లేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ మాత్రం ఓ అడుగు ముందుకేసింది.

పవన్ అభిమానులకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. చాలా కాలం బ్రేక్ తీసుకున్న అనంతరం ‘వకీల్ సాబ్’ వర్క్‌ను తిరిగి ప్రారంభించినట్టు తమన్ ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. ‘వకీల్ సాబ్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘‘వకీల్ సాబ్’ పనులు చాలా కాలం బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పవర్ స్టార్ కోసమైతే.. అన్ని సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా కోసం తన టాలెంట్ మొత్తం వినియోగిస్తాను’’ అని తమన్ ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించారు.

జనసేన అధినేత కాస్తా తిరిగి పవర్ స్టార్‌గా మారి చేస్తున్న తొలి సినిమా ‘వకీల్ సాబ్’. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఆయన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. మళ్లీ తిరిగి సినిమాను ప్రారంభించడంతో అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొందిన పింక్ అనే బాలీవుడ్ మూవీకి తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

More News

తెలంగాణలో తాజాగా 1931 కేసులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు 2000 దాకా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి.

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించారంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి హాజరైన పలువురికి కరోనా!

కరోనా వివాహ వేడుకలను సైతం వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దాని పని అది చేసుకుపోతోంది.

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్ రికార్డులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో మంటలు.. విశేషం ఏంటంటే..

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.