రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన దర్శకుడు

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా 'ఆర్‌.ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుండి ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లు ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అజయ్‌ భూపతి వెయిట్‌ చేయాల్సి వచ్చింది 'ఆర్‌.ఎక్స్ 100' త‌ర్వాత 'మ‌హా స‌ముద్రం' అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ స‌హా ప‌లువురు హీరోల‌ను క‌లిశాడు. అంతా ఓకే అవుతున్న త‌రుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు శ‌ర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు.

ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి ఇందులో మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ కనిపిస్తుంది. 8 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్‌ నటిస్తోన్న తెలుగు చిత్రమిది. ఇన్‌టెన్స్‌ లవ్‌స్టోరి అని తెలియజేసేలా ఇది వరకే పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ఎక్కడ స్టార్ట్‌ చేశామనే సంగతిని యూనిట్‌ రివీల్‌ చేయలేదు. అయితే గోవాలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More News

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఆలియా..

ప్రభాస్‌తో బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం  ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్).

సింపుల్‌గా సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్...

ప్రముఖ గాయని‌ సునీత‌(42) వివాహంపై ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో అసలు ఆ వార్త నిజమా..

నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌కు నాగబాబు కుటుంబం...

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే.

తుపాను బాధితులకు అండగా పవన్ దీక్ష..

తెలంగాణలో తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.

నడిగర్ సంఘం భవంతిలో అగ్ని ప్రమాదం

కోలీవుడ్‌కి చెందిన నడిగర్ సంఘం ఉన్న భ‌వంతిలో అగ్ని ప్రమాదం జరిగింది.