'రోబో' గురించి అక్ష‌య్ కుమార్ ఏమ‌న్నారంటే..!

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

అక్ష‌య్‌కుమార్ '2.0'లో కీల‌క పాత్ర పోషించారు. ర‌జనీకాంత్‌, ఎమీ జాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా '2.0'.

ఈ సినిమా ట్రైల‌ర్ వేడుక‌లో పాల్గొన్న అక్ష‌య్ కుమార్ మాట్లాడుతూ 2, 3 గంట‌లు ప్రాక్టీస్ చేసి త‌మిళ్ లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. ర‌జ‌నీ సార్‌, శంక‌ర్ సార్‌, రెహ‌మాన్‌గారితో క‌లిసి '2.0'లో నా పేరు కూడా ఉండ‌టం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం న‌న్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

అనంత‌రం విశాల్ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన‌ ప్ర‌శ్న‌కు అక్ష‌య్‌ స‌మాధాన‌మిస్తూ నాకు నా జిమ్ ఉంది. నేను ప్ర‌తి రోజూ ఉద‌యం 4 గంట‌ల‌కు లేస్తా మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్న‌త‌నం నుంచి చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. ఎవ‌రూ నన్ను ఇలాగే చేయ‌మ‌ని ఫోర్స్ చేయ‌లేదు. నా జీవితంలో ప్ర‌తి రోజూ నేను స‌న్‌రైజ్‌ని చూస్తాను.

నేను ప్ర‌తి రోజునూ, ప్ర‌తి క్ష‌ణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శ‌రీర‌మే దేవాల‌యం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్ గురించి తెలుసు. త‌ను అన్నం తిన‌డ‌ని నాకు తెలుసు. వాళ్ల అమ్మ‌కు అది న‌చ్చ‌ద‌ని కూడా నేను చ‌దివా. క‌నీసం ఆదివార‌మైనా అన్నం, దోస‌లు, ఇడ్లీలు తినాల‌ని ఆశిస్తున్నా అని అన్నారు.

కృతిక అనే ఫ్యాన్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ ఈ సినిమా వ‌ల్ల నేను చాలా నేర్చుకున్నా. శంక‌ర్ నా దృష్టిలో సైంటిస్ట్. ఆయ‌న డైర‌క్ట‌ర్ మాత్ర‌మే కాదు. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నా. మూడున్న‌ర గంట‌లు కూర్చుని మేక‌ప్ చేసుకోవ‌డం, ఏడాదిన్న‌ర దాన్ని తీసుకోవ‌డం నేను మ‌ర్చిపోలేను. నేను గ‌త 28 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా ఏసుకున్న మేక‌ప్ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేక‌ప్‌తో స‌రితూగ‌దు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంక‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

More News

నేను చెప్తున్నా... సూప‌ర్ డూప‌ర్ హిట్ అంతే! - ర‌జ‌నీకాంత్‌

2.0 ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లో ర‌జ‌నీకాంత్ మాట్లాడారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించిన చిత్ర‌మిది.

'2.0' శంక‌ర్ చెప్పిన విశేషాలు..

2.0కి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌జ‌నీకాంత్‌, ఎమీజాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ శ‌నివారం చెన్నైలో జ‌రిగింది.

'2.0' గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌ర‌ణ‌..

2.0లో వాడిన 4డీ గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌రించారు. శ‌నివారం చెన్నైలో జ‌రిగిన '2.0' ట్రైల‌ర్ లాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ ర‌సూల్ పూకొట్టి

'2.0' త్రీడీ కాదు.. ఫోర్ డీ సినిమా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్ వ‌చ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్, క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫోర్ డీ.. అంటే ఏంటంటే?.. శంక‌ర్ వివ‌ర‌ణ‌

'2.0' టీజ‌ర్‌ను శ‌నివారం 4డీలో విడుద‌ల చేశారు.  4డీ గురించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ ''ఈ సినిమా క‌థ‌ను రాసేట‌ప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వ‌స్తేనే బావుంటుంద‌ని అనుకున్నా.