తన బయోపిక్కి తనే డైరెక్టర్
- IndiaGlitz, [Thursday,February 14 2019]
ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన బయోపిక్ను తనే డైరెక్ట్ చేసుకుంటానని తెలియజేసింది. 'నిజాయతీగా నా జీవితాన్ని తెరకెక్కిస్తాను.
నన్ను నాలా స్వీకరించి ప్రేమించే వారు ఎందరో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలనుకుంటున్నాను. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్గారు నా జీవితకథను పుస్తకంగా రాస్తానని అన్నారు.
ముందుగా కంగారు పడినా, ఆయన గొప్ప రచయిత కాబట్టి అంగీకరించాను. కాబట్టి నా బయోపిక్కి విజయేంద్రప్రసాద్గారే కథను అందిస్తారు. చిన్న ప్రాంతం నుండి వచ్చిన నేను అగ్ర కథానాయికగా ఎలా ఎదిగింది అనే విషయాన్ని నా బయోపిక్లో ప్రస్తావిస్తాను. అలాగే నాకు సాయం చేసిన వాళ్లతో పాటు అవమానించిన వారి గురించి కూడా ఇందులో చూపిస్తాను. అయితే ఎవరి పేరు బయట పెట్టను'' అన్నారు కంగనా రనౌత్.