తన బయోపిక్‌కి తనే డైరెక్టర్‌ 

  • IndiaGlitz, [Thursday,February 14 2019]

ప్రస్తుతం బయోపిక్స్‌ ట్రెండ్‌ ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తన బయోపిక్‌ను తనే డైరెక్ట్‌ చేసుకుంటానని తెలియజేసింది. 'నిజాయతీగా నా జీవితాన్ని తెరకెక్కిస్తాను.

నన్ను నాలా స్వీకరించి ప్రేమించే వారు ఎందరో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలనుకుంటున్నాను. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారు నా జీవితకథను పుస్తకంగా రాస్తానని అన్నారు.

ముందుగా కంగారు పడినా, ఆయన గొప్ప రచయిత కాబట్టి అంగీకరించాను. కాబట్టి నా బయోపిక్‌కి విజయేంద్రప్రసాద్‌గారే కథను అందిస్తారు. చిన్న ప్రాంతం నుండి వచ్చిన నేను అగ్ర కథానాయికగా ఎలా ఎదిగింది అనే విషయాన్ని నా బయోపిక్‌లో ప్రస్తావిస్తాను. అలాగే నాకు సాయం చేసిన వాళ్లతో పాటు అవమానించిన వారి గురించి కూడా ఇందులో చూపిస్తాను. అయితే ఎవరి పేరు బయట పెట్టను'' అన్నారు కంగనా రనౌత్‌.

More News

బాబు-మోదీ గొడవలపై షాకింగ్ నిజాలు చెప్పిన అవంతి

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చలేదని ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చిన సంగతి తెలిసిందే.

నిఖిల్ అర్జున్ సురవరం పోస్టర్ విడుదల

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్.

నాగ‌చైత‌న్య, స‌మంత‌ 'మ‌జిలీ' టీజ‌ర్ లాంఛ్.. 

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న మ‌జిలీ చిత్ర టీజ‌ర్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఈ టీజ‌ర్ లో నాగ‌చైత‌న్య రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అవంతి

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు

అధర్మం పై పోరాడుతున్న జనసేనను ఆశీర్వదించు తల్లీ!

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.