కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు

  • IndiaGlitz, [Saturday,October 17 2020]

బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ముంబై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు, ఇంటర్వ్యూలు ఉన్నాయని కొందరు వ్యక్తులు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి చెండేల్‌పై ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులను కంగన.. బాబర్స్ అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ బేస్ చేసుకుని కంగనపై కొందరు వ్యక్తులు కేసు నమోదు చేశారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయమై తనకు అనిపించింది కంగన నిర్మొహమాటంగా చెప్పేసింది. అక్కడ నుంచి రచ్చ మొదలైంది.

సుశాంత్ ఆత్మహత్య కేసుతో పాటు, డ్రగ్స్ , నెపోటిజం విషయంలో కంగన సంచలన ఆరోపణలు చేసింది. అంతటితో ఈ హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ ఆగితే సమస్య తీవ్రత పెరిగేది కాదేమో.. మహారాష్ట్ర అధికార శివసేన పార్టీని సైతం టార్గెట్ చేసింది. సుశాంత్ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ముంబై నగరం పీవోకేలా మారిందని విమర్శించింది. దీంతో శివసేన కీలక నేతతో పాటు పలువురు నేతలు ఆమెకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ఏకంగా ముంబైలో అడుగుపెట్టు చూద్దాం అంటూ హెచ్చరించారు.

ఈ వివాదాలన్నింటి నడుమ కేంద్రం కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాలక శివసేన, కంగనల మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. కంగన ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌ కూల్చివేసింది. ముంబైలోని ఆమె ఇంటికి అనుబంధంగా ఉన్న ఆఫీసు అక్రమ నిర్మాణమని కార్పొరేషన్‌ అధికారులు నోటీసు అంటించారు. అనంతరం ఆమె సమాధానం ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వకుండానే కూల్చివేతకు నోటీసిచ్చారు. ఇచ్చిందే తడవుగా బుధవారమే జేసీబీలతో అక్కడకు చేరుకుని కూల్చివేయడం మొదలుపెట్టారు. హుటాహుటిన కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్‌ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతపై స్టే తీసుకొచ్చారు. అప్పటి నుంచి కంగన కాస్త తగ్గి తన షూటింగ్ పనులను చూసుకుంటోంది. తాజాగా ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.

More News

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కుటుంబం..

కరోనా మహమ్మారి కల్లోలం ఇంకా రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.

బాలయ్య సరసన మలయాళీ ముద్దుగుమ్మ..!

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావంతో ఆగిన సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

ప్రభాస్‌ పుట్టినరోజు స్పెషల్‌ ఫిక్స్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. వరుసగా ప్యాన్‌ ఇండియా సినిమాలను చేస్తూ వస్తున్నారు.

రవితేజ67 లేటెస్ట్‌ అప్‌డేట్‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను రీస్టార్ట్‌ చేసిన మాస్‌రాజా,

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్.. 3 నెలల క్రితమే ప్లాన్..

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహం ముసుగులో యువతిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం జరిపారు.