ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కాంబినేషన్‌పై ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తున్నప్పటికీ.. తాజా చర్చలు మాత్రం దాన్ని నిజం చేసే దిశగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెలువడనున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘జాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘సాహో’ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రభాష్ అభిమానుల్లోనే కాకుండా.. సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇదలా ఉంటే.. త్రివిక్రమ్ తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ పూజా హెగ్డే నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. భారీ తారాగణంతో.. త్రివిక్రమ్ శైలి టేకింగ్‌తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి.. పందెం కోడిలా కాలుదువ్వుతోంది. అటు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో.. పోటీ మొత్తం ఈ రెండు సినిమాల చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు ఈ రెండు సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More News

చిరు ఫోన్ కోసం వెయిటింగ్.. నాన్నకు చెప్పా!!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

రక్తం ఉడిపోతోంది.. 25 కుర్రాడిలానే.. : చంద్రబాబు

వైసీపీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

‘కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కావాలి’

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

నాడు జగన్‌కు.. నేడు బాబుకు.. సేమ్‌ టూ సేమ్!

ప్రస్తుతం నెట్టింట్లో రెండు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒకటి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది కాగా..

'అల వైకుంఠపురములో' ఒక మంచి అనుభూతినిస్తుంది - త్రివిక్రమ్

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్.