‘ఆమె కథ’.. మొన్న నవ్యకు.. నేడు రవికృష్ణకూ కరోనా..

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బుల్లితెర షూటింగ్‌లు నిర్వహిస్తోంది. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నప్పటికీ పలువురు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, సాక్షి శివ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ‘ఆమె కథ’ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి సైతం కరోనా బారిన పడింది. కాగా తాజాగా ఆ సీరియల్ హీరో, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ రవికృష్ణకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తనకు కరోనా సోకిందని రవికృష్ణే స్వయంగా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం తాను క్షేమమని.. మూడు రోజులుగా ఎలాంటి కరోనా లక్షణాలూ లేవని రవికృష్ణ స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారికి సైతం పరీక్షలు నిర్వహించాలని కోరాడు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ఎవరూ బయటకు రావొద్దని రవికృష్ణ కోరాడు.

More News

బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమక్రమంగా అది అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి కూడా కరోనా వ్యాపించింది.

తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

తెలంగాణలో విశ్వరూపం చూపించిన కరోనా.. నిన్న ఒక్కరోజే...

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్నటి వరకూ 1200 దాటని కరోనా కేసులు నిన్న దాదాపు 1900 కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు.

ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

ఇప్పటికే ‘పలాస 1978’ చిత్రం ద్వారా ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.

పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి.