టీవీ నటికి అక్రమ సంబంధం.. దారుణ హత్య!

  • IndiaGlitz, [Friday,February 14 2020]

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. అంతకంటే ఎక్కువగా మోసపోవడం.. అక్రమ బంధాల వల్ల కూడా ఆత్మహత్యలు, దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం. తాజాగా.. పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. అసలేం జరిగింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!?
పంజాబ్‌‌కు చెందిన అనితా సింగ్‌ (29), రవీందర్‌సింగ్‌ పాల్‌ ఇద్దరూ భార్యాభర్తలు. భార్య అనితకు నటన అంటే మక్కువతో టీవీ సీరియళ్లలో నటిస్తోంది. అంతా సాఫీగా సాగుతున్న ఈ కుటుంబంలోకి అనుమానం అనే పెనుభూతం చొరబడింది. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తి అవి గొడవలు, హత్య దాకా దారితీశాయి. భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. అందుకే తనను దూరంగా పెడుతోందని రవీందర్ భావించి.. ఇక ఆమెను బతకనివ్వకూడదని హతమార్చాలని ప్లాన్ చేశాడు. తనకు బాగా సన్నిహితంగా ఉండే మిత్రుడు కుల్దీప్‌తో కలిసి స్కెచ్ వేశాడు.

స్కెచ్ ఇలా..!?
తన మిత్రుడు కుల్దీప్‌కు బాలీవుడ్‌లో మంచి పరిచయాలున్నాయని.. ఆయన్ను కలిస్తే అవకాశాలు ఇప్పిస్తాడని అనితను భర్త నమ్మించాడు. తనతో ఉత్తరాఖండ్‌‌‌కు అనితను తీసుకెళ్లాడు. అనంతరం ముగ్గురూ కలిసి ఓ ప్రముఖ హోటల్‌లో దిగి.. మొదట భోజనం చేశారు. అనంతరం ఓ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి దాన్ని అనితకు ఇచ్చారు. అది తాగ్గానే ఆమె స్పృహా కోల్పోయింది. అనంతరం ఆ హోటల్ దగ్గర్నుంచి బండిలో అడవుల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. అనంతరం తాము పోలీసులు ఎక్కడా దొరక్కుండా ఉండాలని మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టేశారు.

ఇలా బయటపడింది!
రోజులు గడుస్తున్నా సినిమా అవకాశాలకు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అసలేం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు రవీందర్.. ఆయన మిత్రుడు కుల్దీప్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

More News

డా.రాజశేఖర్ నటవిశ్వరూపంతో 'అర్జున'

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు.

పీఎస్ దగ్గరే 2 వేల కోట్లంటే.. బాబు, లోకేష్‌లను విచారిస్తే..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని..

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేశ్‌పై దాడి!

సినీ క్రిటిక్ కత్తి మహేశ్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య చిత్రం

`118`తో హిట్ సాధించి ప్ర‌స్తుతం `మ‌హాన‌టి`తో జాతీయ అవార్డ్ అందుకున్న‌ కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్.

దిల్ రాజు చేతులు మీదుగా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్ లాంఛ్

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.