EAMCET Web Counselling: వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుకోవాలి...ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ మీ కోసమే

  • IndiaGlitz, [Wednesday,June 07 2023]

విద్యార్ధుల జీవితాల్లో ఇంటర్, డిగ్రీలు కీలకమైన దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఒక్క తప్పటడుగు వేసినా మొత్తం జీవితమే అంధకారంతో నిండిపోతుంది. అందుకే ఆ సమయంలో పెద్దలు, గురువులు, సన్నిహితుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. కెరీర్‌లో ఎన్నో ఆప్షన్లు, మన కలలు కలగలిసి వుండటంతో కోర్సు ఎంపిక చేసుకోవడంలో తికమకపడిపోతుంటారు. చదవాలా, ఉద్యోగం చేయాలా అనే అయోమయం నుంచి బయటపడితే జీవితంలో ముందుకు సాగిపోవచ్చు.

ఇలా కన్‌ఫ్యూజన్‌లో వున్న ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల కోసమే ‘‘ టీవీ9 - కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023’’ . టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జూన్ 9, 10, 11 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.

ఇంటర్ , డిగ్రీ తర్వాత కెరీర్‌లను ఎలా ప్లాన్ చేసుకోవాలనే సందిగ్థంలో వున్న విద్యార్ధులకు టీవీ9 - కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఓ సువర్ణావకాశంగా దోహదపడుతుంది. ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు, యూనివర్సిటీలు పాల్గొనే ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో విద్యార్ధులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, కంప్యూటర్స్, యానిమేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంకా ఎన్నో రకాల కోర్సులు, ఆయా రంగాల్లో వున్న ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు తమకు ఇష్టమైన కెరీర్‌ను ఎంచుకునే విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ టెస్టులైన ఎంసెట్, నీట్, JOSAA, ECETలకు ఎలా సన్నద్ధం కావాలి, వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుుకోవాలనే దానిపై నిపుణుల నుంచి సూచనలు పొందవచ్చు.

More News

ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ : నా ఆగమనం .. అధర్మ విద్వంసం .. క్లాసిక్‌లో యాక్షన్ టచ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. భారతీయుల ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా

YS Jagan: ఇది జగన్ దక్షత : పోలవరం పనుల కదలిక వెనుక అంతా తానై .. సాకారం కానున్న 100 ఏళ్ల స్వప్నం

పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఉరకలెత్తే గోదావరి వృధాగా సముద్రం పాలవుతూ వుండటంతో ఆ నదీ జలాలను ఒడిసిపట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించారా.. లేదా, ఆ సంతకాలు ఎందుకు చేశారు: జగన్‌‌పై నాదెండ్ల ప్రశ్నల వర్షం

పోలవరం ప్రాజెక్ట్ జగన్ పాపపు పథకంగా మారిందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన నాదెండ్ల.. రూట్ మ్యాప్ ఇది, ప్రతి చోటా జనవాణి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి

వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు.