ఓటీటీలోకి ఉప్పెన.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసిందంటే..!

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు.. 21 సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీకి చెందిన డెబ్యూ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక్క వైష్ణవ్‌కే సాధ్యమైంది. అలాగే డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది.

అలాగే ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇది ఈ విషయమై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ‘ఉప్పెన’పై స్టార్ హీరోలంతా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మెగా హీరోలతో పాటు నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మించారు.

More News

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి.

రెండు వారాలు వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం పుష్ప‌. ఇప్ప‌టికే మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్

కేజిన్నర బంగారంతో వెళుతుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్‌..?

కొన్ని వార్త‌లు నిజ‌మైతే బాగుంటుంది.. అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇప్పుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటున్నార‌ట‌.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం స్టార్ రైట‌ర్ క‌థ‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.