గబ్బర్సింగ్ గ్యాంగ్తో 'వాల్మీకి'
- IndiaGlitz, [Tuesday,February 12 2019]
తమిళంలో విజయవంతమైన 'జిగర్ తండా' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహ పాత్రను తెలుగులో వరుణ్తేజ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ పాత్రను శ్రీవిష్ణు చేయబోతున్నాడని సమాచారం. రీసెంట్గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 21 నుండి జరుగనుంది. హైదరాబాద్లో వారంపాటు జరగబోయే ఈ షెడ్యూల్లో సినిమాలో ప్రధాన తారాగణమైన వరుణ్తేజ్, తనికెళ్లభరణి, గబ్బర్సింగ్ గ్యాంగ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా యూనిట్ ఓ క్లారిటీకి రాలేదు. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది కూడా తెలియనుంది.