close
Choose your channels

బాలయ్య కొట్టినా ఫ్యాన్స్ ఏమనుకోరు..!: వసుంధర

Monday, April 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్య కొట్టినా ఫ్యాన్స్ ఏమనుకోరు..!: వసుంధర

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ఫ్యాన్స్‌పై ఏ రేంజ్‌లో చేయిసుకున్నారో మనందరం చూసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో హల్ చల్ చేశాయి. బాలయ్య సినిమాలు నచ్చి నందమూరి అభిమానులుగా మారారు. అంతేకాదు.. ఆయనకు మద్దతుగా హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఒకసారి మీడియా ప్రతినిధిని చేయిచేసుకున్నారు. మరోసారి ఇద్దరు అభిమానులపై బాలయ్య చేయిచేసుకున్నారు. అయితే ఆదివారం రోజున కార్యకర్తలను విజయనగరంలో రోడ్లపై తరిమి తరిమి కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూ వేదికగా బాలయ్య సతీమణి వసుంధర స్పందించారు. 

ఫ్యాన్స్ ఎవరూ ఏమీ అనుకోరు...

"అభిమానులతో ఉన్న చనువు వల్లే, మనవాళ్లు అన్న అభిమానంతోనే ఆయన(బాలయ్య) అలా ఉంటారు. అభిమానులతో బాలయ్య ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటారు. కొన్ని సార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించినా.. తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుంది. అభిమానులతో బాలయ్య అలా ఉంటారు. అభిమానులు కూడా ఏమీ అనుకోరు. వాళ్లు చాలా సంతోషంతోనే ఉంటారు. బాలకృష్ణ అంటే గిట్టనివాళ్లు మాత్రమే దీన్ని వేరే రకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారు. పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరు. బసవతారకం ఆసుపత్రికి ఎవరు వచ్చినా చికిత్సను నిరాకరించలేదు. డబ్బులున్నా, లేకపోయినా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా అందరికీ చికిత్స అందేలా బాలకృష్ణ చొరవ తీసుకుంటారు" అని ఓ ఇంటర్వ్యూలో వసుంధర చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.