శశికపూర్ కన్నుమూత

  • IndiaGlitz, [Monday,December 04 2017]

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌శిక‌పూర్(79) అనారోగ్యంతో క‌న్నుమూశారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ‌శిక‌పూర్ త‌ర్వాత హీరోగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. శ‌శిక‌పూర్‌కు లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌గా ఉండేది. అందువ‌ల్ల త‌నను అంద‌రూ ల‌వ‌ర్‌బోయ్ అని పిలిచేవారు.

సినిమా రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కుగానూ భార‌త ప్ర‌భుత్వం 2011లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది. అలాగే 2015లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదాసాహెబ్ స‌హా ప‌లు అవార్డుల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు.

ఆగ్ అనే సినిమాతో బాల‌న‌టుడిగాఎంట్రీ ఇచ్చిన శ‌శిక‌పూర్, ధ‌ర్మ‌పుత్ర చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. 175 సినిమాల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న నిర్మాత‌గా జునూన్‌, క‌ల్‌యుగ్‌, 36 చౌరింగీ లేన్‌, విజేత‌, ఉత్స‌వ్‌, అజుబా చిత్రాల‌ను నిర్మించారు. అలాగే ఓజ్వారాచెచ్చెనియే అనే ర‌ష్య‌న్ సినిమాతో పాటు అజుబా అనే సినిమాను త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్‌ ఆస్మాన్‌ లాంటి పలు హిట్‌ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

అమితాబ్‌తో కలిసి శశికపూర్‌ దివార్‌, నమక్‌ హలాల్‌ చిత్రాల్లో నటించారు. శ‌శిక‌పూర్ మ‌ర‌ణం ప‌ట్ల చిత్ర సీమ త‌మ సంతాపాన్ని తెలియ‌జేసింది.

More News

విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' రిలీజ్ జనవరి 26

'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది.

వ‌రుణ్ తేజ్ 'తొలిప్రేమ' టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రానికి 'తొలి ప్రేమ‌' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు.

మ‌రోసారి ర‌వితేజ‌తో..

మాస్ మ‌హారాజ్‌  ర‌వితేజ‌కి ఇటీవ‌ల కాలంలో బాగా క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. మ‌రో మాట లేకుండా చెప్ప‌గ‌లిగే పేరు త‌మ‌న్ అని. కిక్‌తో మొద‌లైన ఈ ఇద్ద‌రి ప్ర‌యాణం ఆ త‌రువాత ఆంజ‌నేయులు, మిర‌ప‌కాయ్‌, వీర‌, నిప్పు, బ‌లుపు, ప‌వ‌ర్‌, కిక్ 2 వ‌ర‌కు కొన‌సాగింది.

నాగ్‌, వ‌ర్మ టైటిల్స్ ఇవి..

శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఆ త‌రువాత వ‌చ్చిన అంతం, గోవిందా గోవింద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

స‌మంత పాత్ర గురించి కీర్తి సురేష్ ఏమందంటే..

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం 'మహానటి'. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మోహన్ బాబు (ఎస్.వి.ఆర్), దుల్కర్ సల్మాన్ (జెమినీ గణేషన్), డైరెక్టర్ క్రిష్ (కె.వి.రెడ్డి), డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (సింగీతం శ్రీనివాస రావు) ముఖ్య పాత్రలు పోషి