గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతిరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు ఆయన్ను పరామర్శించారు. మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చెన్నైలో పర్యటిస్తున్న వెంకయ్య విషయం తెలుసుకుని ఆస్పత్రికెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా.. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యం చేయించగా.. చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అపోలోలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. కాగా.. వెంకయ్యకు టాలీవుడ్‌ పెద్దలతో మంచి సంబంధాలున్నాయన్న విషయం విదితమే.

More News

‘పవన్.. నువ్ ఏ రోజైనా చిరంజీవి పేరు చెప్పావా?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ విడుదల

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.

జనసేనకు 70 సీట్లు వచ్చేవి కానీ... పవన్

‘జనసేన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది పార్టీకి ఓట్లు వేసినా 70 సీట్లు వచ్చేవి.

గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న మ్యాచో హీరో గోపీచంద్‌కు ప్ర‌స్తుతం మార్కెట్ వేల్యూ లేకుండా పోయింది.

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

హైదరాబాద్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్.