close
Choose your channels

గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

Tuesday, November 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతిరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు ఆయన్ను పరామర్శించారు. మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చెన్నైలో పర్యటిస్తున్న వెంకయ్య విషయం తెలుసుకుని ఆస్పత్రికెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా.. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యం చేయించగా.. చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అపోలోలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. కాగా.. వెంకయ్యకు టాలీవుడ్‌ పెద్దలతో మంచి సంబంధాలున్నాయన్న విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.