పేరు మార్పు క‌లిసొస్తుందా నాయ‌నా!

  • IndiaGlitz, [Sunday,January 05 2020]

సినిమా రంగంలో ఎంత మంది ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది ఎంత ముఖ్య‌మో చిన్న మ్యాజిక్ కోసం వెయిట్ చేయ‌డం అనేది కూడా కామ‌నే!. దాన్నే సెంటిమెంట్ అంటుంటారు. సినిమా రంగంలో ఇలాంటి సెంటిమెంట్ ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్‌లో నేమ్ చేంజ్ ఒక‌టి. స‌క్సెస్ రానప్పుడు హీరో హీరోయిన్స్ త‌మ పేర్ల‌ను కాస్త అటు మార్చుకుంటారు. ఇప్పుడు ఈ వ‌ర్గంలోకి యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా చేరాడు.

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే త‌ర్వాత ఈ హీరో తెలుగు స‌హా ద‌క్షిణాది భాష‌ల్లో త‌న సినిమాల‌ను చేయాల‌నుకోవ‌డం అందులో భాగంగా నోటా, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల‌ను చేయ‌డం చేశాడు. కానీ అవేవీ ఈయ‌న‌కు పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న పేరుని మార్చుకున్నాడు. అంటే అస‌లు పేరు పెట్టుకున్నాడో.. లేక యాడ్ చేసుకున్నాడో తెలియ‌డం లేదు కానీ.. స్క్రీన్ నేమ్ మాత్రం దేవ‌ర‌కొండ విజ‌య్ సాయి అని రానుంది. ఈ విష‌యం 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్‌' సినిమా టీజ‌ర్‌లో తెలిసింది.

అయితే సినీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు మాత్రం ఇప్పుడున్న పేరుతోనే క‌దా! స్టార్ డ‌మ్ వ‌చ్చింది. అలాంటప్పుడు పేరు మార్పు ఎందుకు? సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ప‌నులు చేయ‌డం ఎందుకు? అని అంటున్నారు. మ‌రి ఈ పేరు మార్పు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఏ మేర క‌లిసొస్తుందో వేచి చూడాలి.

More News

నా జీవితం గ‌తం కంటే ఎంతో బావుందంటున్న స్టార్

కొంద‌రు స్టార్స్ మాట్లాడుతుంటే ఎలాంటి దాప‌రికం ఉండ‌దు. నేరుగా మాట్లాడేస్తారు. కానీ మ‌రికొంద‌రు మాత్రం చాలా దాప‌రికంగా మాట్లాడుతుంటారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ రెండు కేటగిరీకి చెందిన వాడు. రీసెంట్‌గా

త్వరలో మహేశ్-మురగ కాంబోలో సినిమా!!

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన ‘దర్బార్‌’. ఈ చిత్రం జనవరి-09న విడుదల కానుంది.

‘సరిలేరు..’, ‘అల..’ రిలీజ్‌ డేట్స్‌‌పై క్లారిటీ వచ్చేసింది

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో..’

13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తోన్న లేడీ అమితాబ్‌ విజయశాంతి!!

'నేటి భారతం', 'ప్రతిఘటన', 'కర్తవ్యం', 'ఒసేయ్‌ రాములమ్మ' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి,

వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేస్తా..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు గత కొన్ని రోజులుగా రైతులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.