close
Choose your channels

వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేస్తా..!

Saturday, January 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేస్తా..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు గత కొన్ని రోజులుగా రైతులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుతమ్ముళ్లు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపును తీవ్రంగా ఖండించారు. మరోవైపు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఇక్కడ రాజధాని సేఫ్ కాదని.. పలు నివేదికలు పేర్కొన్నాయని అందుకే అమరావతిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ నివేదికలన్నీ బోగస్ అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

జగన్‌కు పాదాభివందనం చేస్తా!
అయితే రాజధాని తరలింపు వ్యవహారంపై తాజాగా బీకాంలో ఫిజిక్స్ అని అప్పట్లో అందరి నోళ్లల్లో నానిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. రాజధాని తరలింపుతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పతనానికి తానే నాంది పలికాడని ఎద్దేవా చేశారు. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానని మీడియా ముఖంగా జలీల్‌ఖాన్‌ తెలిపారు. వైఎస్ జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారని.. అందుకే వారంతా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.కాగా.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపాలైన తర్వాత సైలెంట్‌గా ఉన్న జలీల్.. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన పై వ్యాఖ్యలతో హడావుడి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.