తెలుగు మార్కెట్‌పై హీరో విజ‌య్ ఫోక‌స్‌..

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ట‌ర్‌'. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఆండ్రియా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రంలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారని టాక్‌. విద్యార్థి, మాస్ట‌ర్ అనే రెండు పాత్ర‌ల్లో విజ‌య్ ఎలా ఆక‌ట్టుకుంటాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు అయితే ఆలోపు క‌రోనా ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమా విడుద‌ల‌ను ఆపేశారు.

క‌రోనా ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. థియేట‌ర్స్‌కు స‌డ‌లింపులు ఇప్ప‌ట్లో దొరికేలా క‌న‌ప‌డ‌టం లేదు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. సినిమాను ఇంత ఆల‌స్యంగా వెన‌క్కి తీసుకెళ్ల‌డానికి కార‌ణం.. త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో హీరో విజ‌య్ ఆలోచ‌న చేసి సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌డం విశేషం.

More News

'బాహుబలి'గా మారిన డేవిడ్ వార్నర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

‘ఆత్మ నిర్భర భారత్‌’ నాలుగో ప్యాకేజీ : 8 రంగాల్లో కీలక సంస్కరణలు

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే మూడు ప్యాకేజీలకు సంబంధించి వివరాలను

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇవన్నీ ఇక ప్రైవేట్‌కే..!?

కరోనా మహమ్మారి దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. అసలు ఈ లోటు నుంచి ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు

డిసెంబ‌ర్‌లో నితిన్ పెళ్లి..?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఏర్ప‌డించి జ‌నాలు ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు. అయితే అంతకు ముందే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ సెల‌బ్రిటీలు

అనుష్క 'నిశ్శబ్దం', 'ఉప్పెన‌' ఓటీటీలోనేనా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి