రోడ్డు మీద నడిచినా డబ్బులు వసూల్ చేస్తారా కేసీఆర్.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?: విజయశాంతి

కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు సామాన్యులు బాధపడాల్సి వస్తోందన్నారు తెలంగాణ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. అభివృద్ధి పేరుతో అంకెల గారడి చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... అనవసరంగా అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షాలు హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. పైగా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతామని బెదిరించారని మండిపడ్డారు. అప్పుడు వాళ్లు చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాయన్నారు.

ఇన్నాళ్లు అంకెల గారడి చేస్తూ వచ్చిన కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ సమ్మెను కారణంగా చూపి చార్జీలు పెంచేశారని విమర్శించారు విజయశాంతి. ఆ తర్వాత నిత్యావసర సరుకుగా ఉన్న పాల ధర పెంచిన సీఎం .. ఇప్పుడు కరెంటు చార్జీలను కూడా అమాంతంగా పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అంటే సామాన్యుడి నడ్డి విరిచి వారి నుంచి డబ్బులు వసూల్ చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడిపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వాలకాన్ని చూస్తే... భవిష్యత్తులో సామాన్యుడు రోడ్డు మీద నడిచినా డబ్బులు వసూల్ చేస్తే కానీ ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసేలా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిభాషలో బంగారు తెలంగాణ అంటే ఇదేనేమో అని చురకలు అంటించారు.

More News

లేటెస్ట్‌ కామెడీ రియాలిటీ షో 'అదిరింది' లాంచ్‌ చేసిన జీ తెలుగు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు.

'డిస్కోరాజా' ఇంట్రడక్షన్ సాంగ్ ఢిల్లీవాలాకు అమేజింగ్ రెస్పాన్ !!!

వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది.

మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌,

'హీరో హీరోయిన్' మూవీ పర్వర్ట్ సాంగ్ కు అనూహ్య స్పందన

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో

'ప్రతిరోజు పండగే' సాయి ధరమ్ తేజ్, మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ప్రతిరోజు పండగే. సాయి తేజ్, రాశీ ఖన్నా,