close
Choose your channels

బీజేపీలోకి విజయశాంతి.. దసరా రోజు కాషాయతీర్థం!

Friday, September 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 బీజేపీలోకి విజయశాంతి.. దసరా రోజు కాషాయతీర్థం!

తెలంగాణలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుందా..? కాంగ్రెస్‌కు ‘చేయి’చ్చి.. కీలకనేత అయిన విజయశాంతి అలియాస్ రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోబోతన్నారా..?ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందా..? ఇప్పటికే మంతనాలు కూడా అయిపోయాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది.

ఇప్పటికే పెద్దలంతా చేరిపోయారు!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారింది. దీంతో దీన్నే అదనుగా తీసుకున్న జాతీయపార్టీ అయిన బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తూ.. బలోపేతం కావడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటు ఏపీ నుంచి.. అటు తెలంగాణ నుంచి పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలను పార్టీలోకి రప్పించి కాషాయ కండువా కప్పేశారు కమలనాథులు.

సినిమాల్లోకి రీఎంట్రీ..!
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటరివ్వడంలో ముందుంటే విజయశాంతికి కాషాయ కండువా కప్పడానికి నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన రాములమ్మ.. పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఈ గ్యాప్‌లో సుమారు 13 ఏళ్ల తర్వాత.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా..మరో ఒకట్రెండు సినిమాలకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినవస్తున్నాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే..!
ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఆమెతో భేటీ అయ్యి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. రాములమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. టీఆర్ఎస్ ధీటుగా వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమని భావించిన విజయశాంతి ఏ మాత్రం ఆలోచించకుండా ‘నేను రెఢీ’ చెప్పిందని విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా రోజున.. తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రాములక్క రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.