ఈ ఘన విజయం స్ఫూర్తితో 'పందెంకోడి 3' ప్లాన్‌ చేస్తున్నాం - మాస్‌ హీరో విశాల్‌

  • IndiaGlitz, [Tuesday,October 23 2018]

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలై సూపర్‌ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. 6 కోట్లకు కొన్న 'పందెంకోడి 2'.. 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకు పైగా షేర్‌బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ''పందెం కోడి చిత్రం నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నేనెక్కడికి వెళ్ళినా అందరూ పందెం కోడి.. అని పిలిచేవారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చెయ్యాలనుకున్నప్పుడు ఆ సినిమా రేంజ్‌లో చెయ్యగలమా అనే ఒక టెన్షన్‌ ఉండేది. అందువల్లే పందెంకోడి 2 చెయ్యడానికి 13 ఏళ్ళు పట్టింది. నేను, లింగుస్వామి కథను నమ్మి ఈ సినిమా చేశాం.

లింగుస్వామి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు ఈ సినిమాను మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. నాకు ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చింది. నిర్మాతగా కూడా మంచి విజయాన్ని ఇచ్చింది. 'మహానటి' తర్వాత కీర్తి సురేష్‌ ఈ సినిమాలో కాంట్రాస్ట్‌గా ఉండే ఓ డిఫరెంట్‌ రోల్‌ చేసింది. తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే విలన్‌గా నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సినిమాకి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ కూడా ఈ సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ విజయం స్ఫూర్తితో 'పందెంకోడి 3'ని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ '' మహానటి' వంటి క్లాసిక్‌ మూవీ తర్వాత ఒక మంచి మాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడే థ్రిల్‌ అనిపించింది. రిలీజ్‌ అయ్యాక నా పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. 'పందెం కోడి 2' అనేది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీ అయింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

More News

'అవ‌తార్ 2'...'అవ‌తార్ 3' ఎప్పుడంటే..?

జేమ్స్ కామెరూన్ దర్శ‌క‌త్వంలో 2009లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ 'అవ‌తార్‌'. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ సినిమా సీక్వెల్స్‌ను సిద్ధం చేస్తున్నారు.

మీ టూ పై రెహ‌మాన్ స్పందన‌...

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మీటూ వ్య‌వ‌హారంపై త‌న స్పంద‌ను తెలియ‌జేశారు. రెరీసెంట్‌గా వైర‌ముత్తు త‌దిత‌రులపై మీటూలో లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

డ్ర‌గ్స్ కేసులో విల‌న్ అరెస్ట్‌

అజాజ్ ఖాన్‌.. హిందీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు. స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ద్వారా ఫేమ‌స్ కూడా అయ్యాడు. తెలుగులో దూకుడు, నాయ‌క్‌, బాద్‌షా చిత్రాల్లో న‌టించారు.

పరువు కంటే ప్రేమే గొప్పది అని చెప్పే చిత్రం 'బంగారి బాలరాజు' - హీరో రాఘవ్

నంది క్రియేషన్స్ పతాకంపై  నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో  కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బంగారి బాలరాజు'.

అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ మ‌రో చిత్రం

స‌క్సెస్‌ఫుల్ వ్యాపార‌వేత్త‌గానే కాదు.. సినిమా రంగంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు అభిషేక్ అగ‌ర్వాల్‌.