close
Choose your channels

అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ మ‌రో చిత్రం

Tuesday, October 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ మ‌రో చిత్రం

స‌క్సెస్‌ఫుల్ వ్యాపార‌వేత్త‌గానే కాదు.. సినిమా రంగంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు అభిషేక్ అగ‌ర్వాల్‌. ఇటీవ‌ల ఆయ‌న చిత్ర నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టారు. ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన 'గూఢ‌చారి' విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద చాలా పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అభిషేక్ అగ‌ర్వాల్‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు రూపొంద‌నున్నాయి. తాజాగా వీరి క‌ల‌యిక‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నార్ చోప్రా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో అభిషేక్ అగ‌ర్వాల్ మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రీక‌ర‌ణంతా విదేశాల్లోనే జ‌రుగుతుంది.

ప్రెస్టీజియ‌స్‌గా రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని టాప్ టెక్నీషియ‌న్స్‌తో నిర్మించ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.