'ఓ మై గాడ్' ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ కి హ్యాపీ - మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్

  • IndiaGlitz, [Tuesday,November 24 2015]

తనీష్, మేఘశ్రీ, పావని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఆడియో కి వచ్చిన రెస్పాన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా హ్యాపీ గా వున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''నేను గతం లో చేసిన మొగుడ్స్ పెళ్లాంస్ నుండి..ఇప్పటి వరకు 15 సినిమాలకు మ్యూజిక్ అందించ్చాను. ఈ మధ్య కాలంలో నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం 'ఓ మై గాడ్'. ఈ పాటలు విన్నవారందరూ అభినందిస్తుంటే చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాసం ఇచ్చిన దర్శకులు వి.శ్రీవాత్సవ్ గారికి, నిర్మాత వేణు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పాటలు ఇంత బాగా రావడానికి మా లిరిక్ రైటర్ ఉత్తరావెల్లి రామారావు అందించిన సహకారం మరవలేనిది. అలాగే మా సింగర్ రమ్య కోయిల్ ఫస్ట్ టైం సింగర్ గా చాలా బాగా పాడింది. ఈ సినిమాలోని పాటలను ప్రేక్షకులకు ఇంతగా ఆదరించినందుకు..కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...'' అన్నారు.

More News

యూత్‌ను ఆక‌ర్షిస్తున్న కుమారి

సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఆర్య‌, 100%ల‌వ్ త‌ర‌హా క్యూట్ ల‌వ్ స్టోరీస్ వ‌చ్చాయి. ఒక అడుగు ముందుకేసి సుకుమార్ చేసిన బోల్డ్ అటెంప్ట్ కుమారి 21ఎఫ్‌.ప్రేమ‌కు కావాల్సింది న‌మ్మ‌కం.

కమల్ ని ముద్దు పెట్టుకోవడం కథకు చాలా అవసరం - నటి మధుశాలిని

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్,శ్రీగోకులం మూవీస్ పతాకాలపై రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్.చంద్రహాసన్,కమల్ హాసన్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'చీకటి రాజ్యం'.

రామ్మోహన్ కి కాఫీకి పిలవలేదా?

రామ్మోహన్ దర్శకత్వంలో అవికాగోర్ నటించిన సినిమా తను నేను.ఈ నెల 27న విడుదల కానుంది.ఈ నెల 27న అనుష్క నటించిన నటించిన సైజ్ జీరో విడుదల కానుంది.

పాటలు పాడుకుంటున్న సావిత్రి..

వైవిధ్యమైన కథలతో పాటు వెరైటీ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ సావిత్రి అనే లేడీ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

నారా రోహిత్ సిక్స్ ప్యాక్

విష్ణు చేసిన సిక్స్ ప్యాక్ ను సరదాలో చూపిస్తున్నారు.నారా రోహిత్ తన సిక్స్ ప్యాక్ ను సావిత్రిలో చూపించనున్నారు.నారా రోహిత్ హీరోగా సావిత్రి అనే సినిమా రూపొందుతోంది.