మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీదే.. సీఎం జగన్ హామీ..

  • IndiaGlitz, [Thursday,April 04 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గం వల్లే రెండు రోజుల్లో 31 మంది అవ్వాతాతలు చనిపోయారని సీఎం జగన్ ఆరోపించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో ప్రగించారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు.

'మరో 5 వారాల్లో ఎన్నికలనే మహా సంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడుతున్నాం. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. పేద, సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మారుస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుంది. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం' అని వెల్లడించారు.

'ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేశాం. అన్ని సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. దశల వారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. నా వెంట నా తోబుట్టువులు ఉన్నారు. మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. జగన్ మామ అని పిలిచే చిన్నారులు ఉన్నారు. పేదల భవిష్యత్తు మార్చేలా 58 నెలలుగా అడుగులు పడ్డాయి.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

అంతకు ముందు చిన్న సింగనమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చానని తెలిపారు. అలాగే మళ్లీ అధికారంలోకి రాగానే టిప్పర్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10వేలు ఇస్తానని ప్రకటించారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ కూడా చేశారు. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగకుండా... వేలిముద్రగాడంటూ వీరాంజనేయులును అవమానించాడు. చంద్రబాబూ... నువ్వు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా... నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ! అంటూ విమర్శించారు.

More News

అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా..

ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు.

Kavitha: లిక్కర్ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని

ఏపీలో బదిలీ అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు

ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Buddha Prasad: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు..

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారుతో పాటు రైల్వేకోడూరు అభ్యర్థిని మారుస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

YSRCP: గ్రౌండ్‌లోకి దిగిన సీఎం జగన్.. గణనీయంగా పెరిగిన వైసీపీ గ్రాఫ్..

ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాటే వినిపిస్తోంది.