close
Choose your channels

మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీదే.. సీఎం జగన్ హామీ..

Thursday, April 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీదే.. సీఎం జగన్ హామీ..

టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గం వల్లే రెండు రోజుల్లో 31 మంది అవ్వాతాతలు చనిపోయారని సీఎం జగన్ ఆరోపించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో ప్రగించారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు.

'మరో 5 వారాల్లో ఎన్నికలనే మహా సంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడుతున్నాం. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. పేద, సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మారుస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుంది. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం' అని వెల్లడించారు.

మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీదే.. సీఎం జగన్ హామీ..

'ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేశాం. అన్ని సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. దశల వారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. నా వెంట నా తోబుట్టువులు ఉన్నారు. మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. జగన్ మామ అని పిలిచే చిన్నారులు ఉన్నారు. పేదల భవిష్యత్తు మార్చేలా 58 నెలలుగా అడుగులు పడ్డాయి.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

అంతకు ముందు చిన్న సింగనమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చానని తెలిపారు. అలాగే మళ్లీ అధికారంలోకి రాగానే టిప్పర్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10వేలు ఇస్తానని ప్రకటించారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ కూడా చేశారు. "జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగకుండా... వేలిముద్రగాడంటూ వీరాంజనేయులును అవమానించాడు. చంద్రబాబూ... నువ్వు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా... నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ!" అంటూ విమర్శించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.