ఆర్జీవీ.. 'టైగర్ కేసీఆర్' లో ఎవరెవరి పాత్రలుంటాయ్!?

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏదైనా కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటిస్తే చాలు అది సంచలనమే.. వివాదాలకు ఇక కొదవుండదు!. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ మొదలుకుని థియేటర్లలోకి వచ్చి టైటిల్ పడేవరకు అన్నీ సంచలనాలే. ఒక్క మాటలో చెప్పాలంటే అదేదో వ్యాపారం విషయంలో మూడు పూవులు.. ఆరు కాయలు అంటుంటారే అదే ఆర్జీవీ అయితే మూడు సంచలనాలు.. ఆరు వివాదాలన్న మాట. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలు చెప్పనక్కర్లేదు.

తాజాగా.. ఆర్జీవీ ప్రకటించిన ‘టైగర్ కేసీఆర్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు శనివారం వర్మ విడుదల చేసిన ఓ వీడియోతో మున్ముంథు ఆయన ఏమేం చేయబోతున్నారా..? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఉంటాయ్..? ఆ పాత్రల్లో ఎవరెవర్ని ఆర్జీవీ పరిచయం చేయబోతున్నారు..? అనేది ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమైంది.

సినిమాలో ఉండేది ఈ పాత్రలేనా!?

సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీశ్ రావ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, లోకేశ్ పాత్రలుంటాయని ఆర్జీవీ ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. పైన చెప్పిన వ్యక్తుల గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది మొదలుకుని.. ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు పైన చెప్పిన వారి పాత్ర ఉంది. వీటన్నింటినీ బేరీజు చేసుకుని ఆర్జీవీ సినిమా తెరకెక్కించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. మున్ముంథు ఇంకా ఎన్ని సంచలనాకు తెరలేపుతాడో..? ఎన్నెన్ని ట్విస్ట్‌లిస్తాడో వేచి చూడాల్సిందే మరి.

More News

"బ్రోచేవారెవరురా" టీజర్ చాలా హంటింగ్ గా.. ఫన్నీగా ఉంది  - అనిల్ రావిపూడి

"మెంటల్ మదిలో" వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా సత్యదేవ్

భారీగా పెరిగిన బంగారం ధర

గురువారం ఒక్కసారిగా రూ.400కు పైగా పడిపోయిన పసిడి ధర.. శుక్రవారం మళ్లీ పైకి కదిలింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.305 పెరుగుదలతో రూ.32,690కు చేరింది.

ఆంధ్రోడా.. నీ తాట తియ్యనీకి వస్తున్నా: ఆర్జీవీ

టాలీవుడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌ల బాట పట్టిన విషయం విదితమే. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టమైన లక్ష్మీపార్వతి పై 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

సంచలనం: సుప్రీంకోర్టు సీజేపై లైంగిక ఆరోపణలు.. కక్ష గట్టిందెవరు!?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. గోగొయ్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసింది.

మానవత్వం ఎక్కడుంది..? రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోల సరసన నటించాలంటూ ఈమెకోసం దర్శకులు