ప‌వ‌న్‌కీ క‌లిసొస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,September 19 2017]

బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించిన కుష్బూ.. ద‌క్షిణాదిన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం వెంక‌టేష్ హీరోగా న‌టించిన క‌లియుగ పాండ‌వులు చిత్రంతోనే. ఆ సినిమా త‌రువాత కొన్ని తెలుగు చిత్రాలు చేసిన‌ప్ప‌టికీ.. త‌మిళంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సి ని పెళ్లాడాక సినిమాల‌ను త‌గ్గించుకున్న కుష్బూ.. తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన స్టాలిన్ చిత్రంతోనే.

ఆ సినిమాలో చిరు అక్కగా న‌టించిన కుష్బూ.. ఆ త‌రువాత ఎన్టీఆర్ య‌మ‌దొంగ‌లో మోహ‌న్‌బాబుకి భార్య‌గా క‌నిపించింది. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ తెలుగులో క‌నిపించ‌లేదామె.

చాన్నాళ్ల త‌రువాత మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రంలో ప‌వ‌న్ అత్త‌గా న‌టిస్తోంది కుష్బూ. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. చిరు, తార‌క్ కి క‌లిసొచ్చిన కుష్బూ.. ప‌వ‌న్ కి కూడా క‌లిసొస్తుందో లేదో చూడాలి.

More News

వివాదానాకి తెరలేపిన వర్మ...

వివాదం లేకపోతే వర్మకు నిద్ర పట్టదేమో కాబోలు.

జై ల‌వ కుశ‌లో పాత్ర తీరులు ఇవీ..

జై ల‌వ కుశ చిత్రంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు పాత్ర‌ల గురించి ఆయ‌న క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు.

'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ

అల్లు వంశీ,అక్షర జంటగా ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో

ఆస్ట్రేలియా లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ సి 420'

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య,దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో

'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం

మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,