మ‌హేశ్‌కు శ‌ర్వా ఓకే చెబుతాడా?

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

నేటి త‌రం అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ మిన‌హా దాదాపు అంద‌రూ నిర్మాత‌లుగా మారిన వారే. వీరిలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే ఉంటూ వ‌చ్చిన మ‌హేశ్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను స్టార్ట్ చేసిన నిర్మాత‌గానూ స్పీడు పెంచాడు. త‌న సినిమాల‌కే కాకుండా ఇత‌ర హీరోల‌తోనూ మ‌హేశ్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నాడ‌ని, క‌థ‌లు వింటున్నాడ‌ని, ఏ క‌థ‌కు ఎవ‌రూ సూట్ అవుతారో నిర్ణ‌యించుకుని వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే త‌న బ్యాన‌ర్‌పై సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి అడ‌విశేష్ హీరోగా మేజ‌ర్ సినిమాను మ‌హేశ్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య ఓ క‌థ విన్న మ‌హేశ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఆ క‌థ‌కు శ‌ర్వాంన‌ద్ యాప్ట్ అవుతాడ‌ని త‌ను భావించాడ‌ట‌. మ‌రి ఇప్ప‌టికే చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న శ‌ర్వానంద్‌కు మ‌హేశ్ ఆఫ‌ర్ న‌చ్చుతుందో లేదో చూడాలి. ఇది కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమాను, త‌మిళ హీరో కార్తితో మ‌రో సినిమాను నిర్మించాల‌ని మ‌హేశ్ భావిస్తున్నాడని వార్త‌లు సోష‌ల్ మీడియాలో బాగా విన‌ప‌డుతున్నాయి. అలాగే మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 27వ సినిమాకు నిర్మాతల్లో ఒక‌డిగా మ‌హేశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని టాక్‌.

More News

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

న‌న్నుదోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన హీరోయిన్ న‌భా న‌టేశ్. త‌ర్వాత మంచి అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంది.

ఇకపై మన ఆర్మీ, పోలీసులను అలా పిలవండి: పరేష్ రావెల్

సమాజంలో నిజమైన హీరోలు ఆర్మీ, పోలీసులేనని.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ తెలిపారు.

అయ్య‌ప్ప మాల వేసుకున్న అఖిల్

అక్కినేని హీరోల్లో అఖిల్ అక్కినేనిని రీసెంట్‌గా చూసిన‌వారు ఓర‌కంగా థ్రిల్ అయ్యారు.

స‌మంత న‌యా క్రియ‌... క్యా కియ‌!

సోష‌ల్ మీడియాలో.. మ‌రీ ఇన్‌స్టాలో స‌మంతను ఫాలో అయ్యేవారికి కొత్త కొత్త టాస్కులు ఎదుర‌వుతుంటాయి.

సుశాంత్ ఫ్యాన్ మెయిడ్ పోస్టర్‌కు నెటిజన్లు ఫిదా

నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.