CM Jagan:వైసీపీకి సోషల్ మీడియానే బలం.. ఈ యుద్ధంలో మనదే విజయం: సీఎం జగన్

  • IndiaGlitz, [Tuesday,April 23 2024]

వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా భీమిలిలో సోషల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఒక ప్రాణాన్ని బలి తీసుకునేంతగా వారి కుట్రలు వెళ్లాయని ఆరోపించారు. తెనాలిలో ఇంటి పట్టా పొంది ఆనందంలో ఉన్న గీతాంజలి అనే మహిళను ఎంత దారుణంగా ట్రోల్ చేసి వేధించారో చూశామని పేర్కొన్నారు.

ఇటువైపు జగన్ ఒక్కడే ఒకడు.. అటువైపు చూస్తే అంతమంది కూడగట్టుకుని వస్తున్నారన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ తట్టుకుని నిలబడగలుతున్నాడంటే దానికి మీరే కారణమని అన్నారు. వారికి పెద్ద పెద్ద పత్రికలు అండవచ్చని కానీ మనకు సోషల్ మీడియా ఉందన్నారు. వైసీపీకి సోషల్ మీడియానే బలమని పేర్కొన్నారు. విజయానికి మనం చేరువలో ఉన్నామనే దానికి సోషల్ మీడియాలో మనపై జరుగుతున్న దాడే నిదర్శనమని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వేధింపులకు గురయిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సెల్‌ఫోన్ ఉన్న చెల్లెలు, తమ్ముడు జగన్‌కు తోడుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా వింగ్ చూపుతున్న ఆప్యాయత, అనురాగాలకు ఎంత చేసినా తక్కువే అవుతుందన్నారు. అన్ని రకాలుగా అందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే మరోసారి వైజాగ్ నుంచి పరిపాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ అనేది ఏపీకి సిటీ ఆఫ్‌ డెస్టినీ అని.. ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన చేస్తే, ఐటీలో ఇతర నగరాలతో పోటీపడుతుందన్నారు. అంతేకాకుండా విజయవాడలో తనపై జరిగిన రాయి దాడిపైనా స్పందిస్తూ ప్రాణాలతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాయబోతున్నాడని తెలిపారు. తనకు భయం లేదని.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో గెలుపు ఖాయమని జగన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

More News

Kavitha:లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. మంగళవారంతో సీబీఐ,

CM Jagan:ఏపీ సీఎం జగన్ ఆస్తులు రూ.779.8కోట్లు.. అప్పులు ఎంతంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం

Helicopters:గాలిలో రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం..

రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు గాలిలోనే పరస్పరం ఢీకొన్న ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది సిబ్బంది చనిపోయారు.

Peddapally Bridge:పెద్దపల్లి జిల్లాలో తప్పిన ప్రమాదం.. మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన

పెద్దపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.  మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన సోమవారం అర్ధరాత్రి

Prabhas:తెలుగు దర్శకుల సంఘానికి భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ చిత్ర పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉంటారనే సంగతి తెలిసిందే. అందరినీ డార్లింగ్ అంటూ అప్యాయంగా పలకరిస్తారు.