కొత్త మంత్రులకు జగన్ కంగ్రాట్స్.. మనమేంటో నిరూపిద్దాం!

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో సహా మొత్తం 25 మంది శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ కొత్త మంత్రులందరికీ ఇప్పటికే శాఖలు కూడా కేటాయింపు జరిగింది. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ ఎవరికి ఏ శాఖ అయితే సరిగ్గా సరిపోతుందో అదే కేటాయించారు. మరీ ముఖ్యంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్‌కు మాత్రం మంచి చాలెంజింగ్ శాఖలు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు, మరికొందరు మంత్రుల విషయంలో అసలు ఎవరూ ఊహించని విధంగా శాఖలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు..? ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి..? అనే విషయంలో జగన్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారని.. చెప్పుకోవచ్చు.

మనమేంటో నిరూపిద్దాం!

కాగా.. బడుగు, బలహీన వర్గాల సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. తన కేబినెట్‌ను జగన్ రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నా సహచరులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మనం వేసే ప్రతి అడుగూ ఏపీ ప్రజలు మేలు కోసమే అయి ఉండాలి. మనం చేసే పనితోనే మనమెంటో నిరూపిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ టు యూ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పలువురు ప్రముఖులు, కేబినెట్ మంత్రులు రియాక్ట్ అవ్వగా.. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

నాన్న సెంటిమెంట్‌ను ఫాలో అయిన జగన్!

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఎవరూ కలలో కూడా ఊహించని..

క్రేజీ కాంబినేష‌న్‌

ఫెయిల్యూర్ లేని ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణి..

'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!! జూన్ 14 న విడుదల

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెన్ ఇన్ బ్లాక్ చిత్రం సిరీస్ లో 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' చిత్రం ఈనెల 14 న రిలీజ్ కాబోతుంది..

మంత్రులకు శాఖల కేటాయింపులో ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు.

జూన్ 21న  విడుద‌ల కానున్న ఫ‌స్ట్ ర్యాంక్ రాజు చిత్రం

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్ ర్యాంక్ రాజు.