దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం అదే పేరుతో ‘దిశ చట్టం’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చట్టం పకడ్బందీ అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ చట్టం అమలుపై.. గురువారం నాడు అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని, కోర్టుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సూచించారు. 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లు!

‘పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మరో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో 176 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలి. మహిళా పోలీస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బంది ఏర్పాటు అంగీకరిస్తున్నాం. ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లను బలోపేతం చేయాలి.. వన్‌స్టాప్‌ సెంటర్లలో ఒక మహిళా ఎస్‌ని నియమించాలి. అదే విధంగా దిశ యాప్‌ కూడా రూపొందించాలి. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్‌ చేయాలి’ అని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు.

పేదవాడి సొంతింటి కల నిజం కావాలి!

పేదవాడి సొంతింటి కల సహకారానికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల్లో అర్హుల గుర్తింపు, నిర్ణిత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు.

More News

ఇంత రాద్ధాంతమా.. రైతులకు న్యాయం చేస్తాం: ఆర్కే

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది.

'లైఫ్ స్టైల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఇలాంటి కథలు తెరమీద చూసి చాలా కాలం అవుతుంది... హీరో శ్రీరామ్ నిమ్మల

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.

జనవరి చివరి వారంలో రానున్న 'పలాస 1978'

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే బుజ్జి హఠాన్మరణం!

తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.