MLC Elections : నాలుగు స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వైసీపీ ఘన విజయం.. !!

  • IndiaGlitz, [Thursday,March 16 2023]

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4 స్థానాల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బరిలోకి నిలిచిన తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఫలితాల్లో వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా.. రామారావుకు 632, స్వతంత్ర అభ్యర్ధి ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.

పశ్చిమలో రెండు, కర్నూలులో ఒక స్థానం :

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. వైసీపీ అభ్యర్ధులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌లు విజయం సాధించారు. కవురుకు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి నిలిచిన వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు పోలయ్యాయి. అలాగే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూదన్ గెలుపొందారు. ఆయనకు 988 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్ధి మోహన్ రెడ్డికి 85 ఓట్లు వచ్చాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమై వైసీపీ ఖాతాలో పడ్డాయి.

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానం ఫలితానికి 48 గంటలు :

మరోవైపు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు 48 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఇక్కడ ఆరు జిల్లాల పరిధిలోని 2 లక్షలకు పైగా ఓట్లు వేశారు. విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 500 మంది ఎన్నికల సిబ్బంది విడతల వారిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అనంతపురంలోని జేఎన్టీయూలో కొనసాగుతోంది.

More News

AP Budget: 2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Balakrishna:చిటికెస్తే చాలు..  బాలయ్య వార్నింగ్, నా ఏరియాలో నీకెం పనంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

Panchathantram:‘పంచతంత్రం’ ... మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద,

Pawan Kalyan:ఇందుకే నువ్వు దేవుడివి సామి.. వారాహి ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన పవన్, వీడియో వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈపేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా..

New Secretariat:ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ : ముహూర్తం ఇదే.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న మేష లగ్నంలో ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు