close
Choose your channels

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్

సీఎం జగన్‌పై రాయి దాడి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మరోవైపు సీఎంపై దాడి ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితులను గుర్తించిన పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టుల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సింగ్‌ నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి చోటు చేసుకుంది. రాయితో కొట్టింది సతీష్ అనే వ్యక్తి అని పేర్కొన్న పోలీసులు అతడికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావును చేర్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సతీష్ సీఎం జగన్‌పై దాడి చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్

బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్.. సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది. ఇక సతీష్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.

కాగా ఈ నెల 13 వ తేదీన మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిదివిషయం విధితమే. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పై భాగంలో గాయం అయింది. దాడి సమయంలో సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం అయింది. వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.