నాపైనా, నా ఫ్యామిలీపైనా ట్రోలింగ్.. ఓ ఇద్దరు హీరోల పనే ఇది, శిక్ష తప్పదు : మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Thursday,February 17 2022]

తనపైనా, తన కుటుంబంపైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ఇద్దరు హీరోలు దీని వెనుక వున్నారని.. ట్రోలింగ్, మీమ్స్ కోసం ఓ వందమందిని వారిద్దరూ నియమించుకున్నట్లు తెలిసిందని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంతో మోహన్ బాబు హీరోగా మంచు విష్ణు తెరకెక్కించిన ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మోహన్ బాబు రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌దని మోహన్ బాబు హితవు పలికారు. సాధార‌ణంగా తాను ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను ప‌ట్టించుకోనని.. ఎవ‌రైనా నాకు పంపిన‌ప్పుడే చూస్తానని ఆయన చెప్పారు. అయినా వాటిని పెద్దగా పట్టించుకోలేదని... కానీ ఇటీవల ఇవి హ‌ద్దులు మీరుతున్నాయని, ఇలాంటి వాటిని చూసిన‌ప్పుడు బాధ‌గా ఉంటుందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో తనకు తెలియ‌దని.. కానీ వ్య‌ంగ్యంగా ట్రోల్ చేయ‌డం అనేది బాధ కలిగిస్తుందన్నారు. ట్రోలింగ్ చేయిస్తున్న ఇద్దరు హీరోలెవరో తనకు తెలుసునని.. వారిని ప్రకృతి గ‌మ‌నిస్తోందని మోహన్ బాబు అన్నారు. ఇప్పుడు వారికి బాగానే ఉండవచ్చు.. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభ‌విస్తారని, ఆ సమయంలో వారికి ఎవరు అండగా నిలవరని పెదరాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మోహన్ బాబు చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

More News

అమితాబ్ బాడీగార్డ్‌‌గా విధులు.. కానిస్టేబుల్ ఆస్తులు చూసి షాకైన అధికారులు

ప్రముఖులు, సెలబ్రెటీల పేర్లు చెప్పి.. లేదా వాళ్లతో ఫోటోలు దిగి కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన ఉదంతాలు ఎన్నో. అయితే ఈ కేసులో మాత్రం ఏకంగా సెలబ్రెటీ దగ్గర పనిచేసిన మాజీ అంగరక్షకుడు కోట్లు వెనకేశాడు.

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

అగ్ర కథానాయకుడు, కింగ్ నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త

చిన్నారులను బైకుపై తిప్పుతున్నారా.. కొత్త రూల్ తెలుసా..?

చిన్నారులను బైకులపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నారా..

పెళ్లి చేసుకోనున్న 23 ఏళ్ల మేయ‌ర్, 28 ఏళ్ల ఎమ్మెల్యే, ముహూర్తం ఎప్పుడంటే..?

ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయాలకు యువత దూరమవుతున్న సంగతి తెలిసిందే.

'వర్జిన్ స్టోరి' నిజమైన ప్రేమకు పరీక్ష పెడుతుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్.