అప్పుడు చంద్రుడు.. ఇప్పుడు రాహుల్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు టీడీపీ ఇద్దరూ కలిసి ఎంఐఎం-టీఆర్ఎస్ను టార్గెట్ చేసి దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘‘ఔర్ మిష్టర్ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్ కమింగ్ టూ ఆంధ్రప్రదేశ్.. సిద్దంగా ఉండూ’’ అంటూ అప్పట్లో సినీ స్టైల్లో డైలాగ్ పేల్చారు. అంతటితో ఆగని ఆయన.. ఏపీకి వస్తా.. టీడీపీకి వ్యతిరేకంగా.. మిత్రుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తా. మా తడాఖా ఏమిటో చూపిస్తానంటూ చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈయన డైలాగ్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి.
అయితే తాజాగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం అసదుద్దీన్ హెచ్చరికలు జారీ చేశారు. ‘అమేథీకి వస్తా.. రెచ్చగొట్టేలా ప్రసంగిస్తా.. ’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎంఐఎం ‘బి’ టీమ్ అని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ అన్నారని అందుకే తాను కూడా ఆయన నియోజకవర్గానికి వెళ్లి రెచ్చగొట్టేలా ప్రసంగిస్తానంటూ అసద్ చెప్పుకొచ్చారు.
తమ్ముళ్లు కౌంటర్లిస్తున్నారు..!
"మా చంద్రబాబును అంత మాటంటావా..? రా మీ సంగతి తేలుస్తాం..? బాబు దాకా ఎందుకు నాపై పోటీ చేసి గెలువు చాలు. దమ్ముంటే నంద్యాలకు రా.? ఒకసారి నాపై ఓడిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా.. నంద్యాల నుంచే ఎక్కడ్నుంచైనా సరే కేసీఆర్ గానీ అసద్ గానీ పోటీ చేయొచ్చు" అంటూ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లెక్కలేనన్ని సవాళ్లు విసిరారు. అయితే ఈ సవాళ్లపై అసద్ ఇంత వరకూ స్పందించిన దాఖలాల్లేవ్.
తెలంగాణతో పోలిస్తే ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్.. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో సర్వేలు చేయడానికి సంస్థలు జంకుతాయ్. అలాంటి పరిస్థితుల్లో అసదుద్దీన్ ఏపీకి వచ్చి ఏం చెబుతారు..? మిత్రుడు జగన్కు ఏ మాత్రం ఓట్లు సంపాదించి పెడతారు..? అనేది ఆసక్తికరంగానే ఉంది మరి. అయితే ఇది ఏ మేరకు ఆచరణ వస్తుందో..? అసద్ మాటలకే పరిమితవుతురా..? లేకుంటే నిజంగానే ఏపీలో ప్రచారానికి వస్తారో? ఒకవేళ ఆయనొస్తే ముస్లీంలు ఎలా రియాక్టవుతారు..? అనే విషయాలు తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.