'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ లాంచ్

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైల‌ర్‌ను 'మ‌హాన‌టి' దర్శకుడు నాగి మరియు నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా...

మధుర శ్రీధర్ మాట్లాడుతూ '' ఇంట్రెస్టింగ్ టైటిల్. 'మ‌ళ్ళీరావా'లాంటి మంచి చిత్రాన్ని నిర్మించి, అభిరుచి గ‌ల నిర్మాత అని పేరు తెచ్చుకున్న రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ సినిమా నిర్మాత అంటే సినిమా ఏంటో అర్థం అవుతుంది. నవీన్ మంచి యాక్టర్. అతను నటిస్తున్న ఈ డిఫరెంట్ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డైరెక్ట‌ర్ నాగి మాట్లాడుతూ '' నవీన్ నాకు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం నుంచి పరిచయం. త‌న‌లో మంచి నటుడు ఉన్నాడు. యూనిక్‌గా ప్రమోట్ చేస్తే సినిమాపై ఆటో మేటిక్‌గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి ప్రమోషన్స్‌తోనే వస్తున్నారు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' టీమ్. ట్రైలర్‌లో కామెడీ, థ్రిల్లర్ కనిపిస్తున్నాయి. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నారని మాత్రం అర్ధం అవుతుంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుతున్నా'' అన్నారు.

చిత్ర దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ '' ఏజెంట్ అనే ప‌దం ప‌క్క‌న ఇంగ్లీష్ పేర్లతో ఉన్న టైటిల్స్ చాలా కనిపిస్తాయి మనకు. అందుకే ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు క‌న్విన్స్ అవ‌లేదు. టైటిల్ డిజైన్ చేశాక క‌న్విన్స్ అయ్యారు. టైటిల్ లాగానే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడు. సినిమా చూశాక మంచి ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు'' అన్నారు.

నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా మాట్లాడుతూ '' స్క్రిప్ట్ నన్ను ఆలోచింప చేసింది. టైటిల్ చూసి భయపడ్డాను. కానీ డిజైన్ చూశాక స‌ర్‌ప్రైజ్ అయ్యాను. నవీన్ లాంటి నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నా. నా సినిమాకు ప్రతిసారి కొత్త టాలెంట్‌ల‌ను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నా. అలానే ఈ చిత్రంతో నవీన్‌తో పాటు డైరెక్టర్ స్వరూప్ కూడా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' డిఫరెంట్ గా ఉండంతో పాటు ఆలోచింప చేస్తుందని నమ్మకంగా చెప్పగలను'' అని అన్నారు.

హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ '' యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌తో అందరికీ సుపరిచితుడ్నే. ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా. నాకు చాలా స్పెష‌ల్ మూమెంట్ ఇది. లండన్ లో ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలీవుడ్‌లో కొన్ని వెబ్ సీరీస్‌లు కూడా చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా న‌టిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి త‌యారు చేసుకున్నాను. త‌ర్వాత నిర్మాత రాహుల్‌గారిని క‌లిశాం. జూన్ 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఈ చిత్రం తప్పకుండా నవ్విస్తుందని చెప్పగలను'' అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్, సౌండ్ డిజైనర్ నాగార్జున్ తల్లపల్లి,పాట‌ల ర‌చ‌యిత కృష్ణ కాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, రామ్ దూత్, సుహాస్, శ్రద్ధా రాజగోపాలన్, కృష్ణేశ్వర్ రావు, విశ్వనాథ్, ప్రశాంత్, సందీప్ రాజ్, విను వర్మ, అప్పాజీ అంబర్శ్ దర్భ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆడియోగ్రఫీ: అజిత్ అబ్రహామ్ జార్జి, మ్యూజిక్: మార్క్ రాబిన్, సౌండ్ డిజైన్: నాగార్జున్ తల్లపల్లి, లిరిక్స్: కృష్ణ కాంత్, సింగర్: అనురాగ్ కులకర్ణి, కాస్ట్యూమ్స్: మోనిక యాదవ్- వనజ యాదవ్, ఆర్ట్: క్రాంతి ప్రియం, ఎడిటర్-కో డైరెక్టర్: అమిత్ త్రిపాఠి, సినిమాటోగ్రఫీ: సన్నీ కృపాటి, స్క్రీన్ ప్లే: స్వరూప్- నవీన్ పొలిశెట్టి, ప్రొడ్యూసర్: రాహుల్ యాదవ్ నక్కా, స్టోరీ-డైలాగ్స్- డైరెక్షన్: స్వరూప్ ఆర్.ఎస్.జె.

More News

హాలీవుడ్ సినిమా ఆధారంగానే అడివిశేష్ సినిమానా?

క్షణం, గూఢ‌చారి చిత్రాల‌తో వ‌రుస హిట్స్ సాధించిన అడివిశేష్ ఇప్పుడు `ఎవ‌రు` సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఛార్మి పిర్యాదు

హీరో రామ్ తో పూరి జ‌న్నాథ్ తెరకెక్కిస్తున్నచిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌జ్ బాస్కెట్‌ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.

20 ఏళ్ల త‌ర్వాత‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్.. ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి క‌లయిక‌లో 20 ఏళ్ల‌కు ముందు  అంటే 1999లో `హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌`

మ‌రోసారి త‌ల్లి పాత్ర‌లో శ్రియా శ‌ర‌న్‌

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత న‌టి శ్రియా శ‌ర‌న్ సినిమా రంగానికి కొన్ని నెల‌లు పాటు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు వీరే..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి 25 మందిని తన కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. వారి పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారు కాగా..