హాలీవుడ్ సినిమా ఆధారంగానే అడివిశేష్ సినిమానా?
Send us your feedback to audioarticles@vaarta.com
క్షణం, గూఢచారి చిత్రాలతో వరుస హిట్స్ సాధించిన అడివిశేష్ ఇప్పుడు `ఎవరు` సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. క్షణం తర్వాత అడివిశేష్, ప్రసాద్ వి.పొట్లూరి కలయికలో వస్తోన్న సినిమా ఇది. అసలు ఎప్పుడు మొదలు పెట్టారో కూడా తెలియనంత స్లోగా సినిమాను ముగించేస్తున్నారు.
ఈ సినిమాను హాలీవుడ్ మూవీ `ది ఇన్విజబుల్ గెస్ట్` స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్నారట. అడివిశేష్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. రెజీనా కసండ్ర హీరోయిన్. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఆగస్ట్ 23న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.