close
Choose your channels

స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

Saturday, March 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి ఇది వేదికగా నిలుస్తుందని మోదీ పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధానికి భారతీయులందరూ ‘పీఎం కేర్స్ ఫండ్’ కు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. చిన్నమొత్తాలు అయినా సరే విరాళాలుగా అందించవచ్చని మెదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘పీఎం కేర్స్ ఫండ్’ బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా మోదీ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

భారీ విరాళం..

మోదీ ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించి.. భారీ విరాళం ప్రకటించారు. తాను రూ.25 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ప్రకటించారు. ‘ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదే. మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. నావంతుగా నేను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాను. మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం’ అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇందుకు మోదీ కూడా స్పందించి గ్రేట్ అని ప్రశంసించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.