close
Choose your channels

APSSCResults2022 : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్

Monday, June 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. 2,02,821 మంది బాలురు పాసైతే.. 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 67.26 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవ్వగా.. ఇందులో బాలురు 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం మంది పాసయ్యారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా (78.30 శాతం) ప్రథమ స్థానంలో వుండగా.. అనంతపురం జిల్లా (49.70 శాతం) చివరి స్థానంలో నిలిచింది.

71 పాఠశాలల్లో ఉత్తీర్ణత ‘సున్నా’ :

రాష్ట్రంలో 11,671 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వీటిలో 797 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. 71 పాఠశాలల్లో ‘సున్నా’ శాతం అంటే ఎవ్వరూ పాసవ్వలేదు. వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రేపటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుందని.. ఈ నెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నామని బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్ధులతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

నిజానికి శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విద్యార్ధులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.