close
Choose your channels

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

Wednesday, June 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. హైకోర్టులో విధులు నిర్వహిస్తూ రిజిస్ట్రార్ జనరల్(ఆర్‌జీ) గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న రాజశేఖర్ నిన్ననే ఓ మహిళాధికారిని రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించారు. మరుసటి రోజే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందడం హైకోర్టు సిబ్బందిని కలచి వేస్తోంది. సమాచారం అందుకున్న హైకోర్టు సిబ్బంది రాజశేఖర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.