close
Choose your channels

Taraka Ratna:తారకరత్నను బాలయ్య మృత్యుంజయ మంత్రమే రక్షిస్తోంది.. ఇదొక మిరాకిల్ : నిర్మాత వ్యాఖ్యలు

Wednesday, February 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎక్మో పరికరంపై చికిత్స అందిస్తున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈ వ్యాఖ్యలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ, నందమూరి కుటుంబం ఖండించింది. ఇప్పటికే తారకరత్నను చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ఇతర కుటుంబ సభ్యులు పరామర్శించారు. అయితే బాలకృష్ణ మాత్రం తారకరత్న గుండెపోటుకు గురైన నాటి నుంచి నేటి వరకు ఆయన వెన్నంటే వుంటున్నారు. కుప్పం ఆసుపత్రితో పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలోనే వుంటూ ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. వైద్యులకు , కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు అందుబాటులో వుంటున్నారు.

బాలయ్య గొంతుతో తారకరత్నలో చలనం :

తాజాగా తారకరత్న విషయంలో బాలకృష్ణ తీసుకుంటున్న చొరవను నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మీడియాకు తెలిపారు. బాలయ్య వచ్చిన తర్వాతే తారకరత్నకు రికవరీ అయ్యిందని.. తనకు ఇదొక మిరాకిల్‌లా అనిపిస్తోతందని ఆయన అన్నారు. తారకరత్న గుండె ఆగిందనుకున్న సమయంలో బాలయ్య పిలుపునకు ఆయన స్పందించారని.. అప్పుడు బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదవడంతో మళ్లీ పల్స్ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యిందని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. తారకరత్న ఇప్పటి వరకు జీవించి వున్నారంటే అందుకు కారణం బాలయ్యేనని తుమ్మల అన్నారు. ప్రస్తుతం తుమ్మల మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది :

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ‘‘ సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ట్వీట్ చేశారు.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.