బ్లేడ్ రాజా ‘బండ్ల’ మళ్లీ వచ్చాడు.. జగన్‌ నిద్రలేవాలి!!

  • IndiaGlitz, [Wednesday,September 11 2019]

‘ఆంధ్రా.. బీహార్‌లా తయారైంది.. జగన్ నిద్రలేవాలి’ అని వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది ఎవరో కాదు.. ఒకప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ కాంగ్రెస్‌లో చేరి.. బ్లేడ్‌తో కోసుకుంటానని చెప్పి హడావుడి చేసి.. ఆ తర్వాత రాజకీయాలకి శాశ్వతంగా దూరమైన బండ్ల గణేష్. తనను ఎవరూ పట్టించుకోవట్లేదని అనుకుని మీడియా ముందుకు వచ్చారో.. లేకుంటే అందరూ మాట్లాడుతున్నారు కదా.. నేనేమీ మాట్లాడకుంటే బాగోదని ఉనికి కోసం మాట్లాడారో ఆయనకే తెలియాలి కానీ.. తాజా వ్యాఖ్యలతో మాత్రం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

ఏపీ పరువు గంగలో కలిసిపోయింది!
ఏపీలో ‘పల్నాడు గొడవలు’ జరుగుతుండగా.. పోటా పోటీగా వైసీపీ-టీడీపీ పార్టీలు ‘ఛలో ఆత్మకూరు’ను నిర్వహించడం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు కీలకనేతలను హౌస్ అరెస్ట్ చేసి.. పరిస్థితులను పోలీసులు అదుపులోకి తెచ్చారు. అయితే తాజా పరిణామాలపై బండ్ల గణేష్ స్పందించిన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందన్నారు. అంతటితో ఆగని ఆయన.. ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందని వ్యాఖ్యలు చేశారు.

మీకు సాయం చేసే స్థితిలో నేను లేను!
‘పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పని చేస్తే రాష్ట్రానికి మంచిది. వందరోజుల పాలనలో ఏమీ చెయ్యనీ సీఎం జగన్ నిద్రలేవాలి. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిది. దగాపడ్డ తెలుగు ప్రజలారా!.. ఏ నాయకుడిని నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను.. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’ అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి!
జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిదనే వ్యాఖ్యలు బండ్ల ఎవర్ని ఉద్దేశించి అన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి అన్నారా ..? లేకుంటే పవన్‌ను ఉద్దేశించి అన్నారా..? అనేది ఆయన తెలియాలి మరి. మొత్తానికి చూస్తే తాను ఉన్నాను.. అని జనాలకు గుర్తు చేసుకోవడానికి బండ్ల ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

More News

కేటీఆర్‌కు మ‌హేశ్ మ‌ద్ద‌తు

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తెలంగాణ మున్సిప‌ల్ మినిష్ట‌ర్ కేటీఆర్‌కు మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు.

చంద్రబాబుపై సుజనా షాకింగ్ కామెంట్స్!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఒకప్పటి టీడీపీ ఎంపీ, ఆయనకు నమ్మకస్తుడైన సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘మా’లో గొడవలపై వివరణ ఇచ్చుకున్న కార్యవర్గం!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడవలు జరుగుతున్నాయని.. ఒకరంటే ఒకరికి పడట్లేదని గత కొన్ని రోజులుగా మీడియా, సోష‌ల్ మీడియాలో

విజయ్ కాదు.. ప్రభాస్ హాట్‌గా కనిపిస్తారు! - పాయల్ రాజపుత్

ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజపుత్.. యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు - నాని

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)