close
Choose your channels

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

Wednesday, October 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు మొదలుకుని ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటుపై తేలని లెక్క బుధవారంతో తేలిపోయింది. సీఎం పదవి ఇచ్చితీరాల్సిందేనని శివసేన పట్టుపట్టిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం ‘ఆ ఒక్కటి అడక్కు..’ అన్నట్లుగా సీఎం సీటును మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేసింది. అయితే తాజాగా శివసేనకు బీజేపీ బంపరాఫర్ ఇచ్చింది.

డిప్యూటీ సీఎం పదవితో పాటు 13 మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ బంపరాఫర్ ఇచ్చింది. అయితే సీఎం పదవి మాత్రం అడగాల్సిన అక్కర్లేదని బీజేపీ తేల్చిచెప్పేసింది. అయితే 26 మంత్రి పదవులు మాత్రం బీజేపీనే తీసుకుంటుందని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్ భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రేపు అనగా గురువారం నాడు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. కూటమి విజయం ఘనత ఉద్దవ్ థాక్రేదేనని ఫడ్నవిస్ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. త్వరలోనే అభిప్రాయభేదాలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ఇండిపెండెంట్లు కూటమికి మద్ధతిచ్చారని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకూ ఓకే గానీ ఈ ప్రకటనతో శివసేన రాజీ అయినట్లేనా.. ? లేకుంటే 50:50 నే అని మొండికేసి మళ్లీ తిష్టవేసి కూర్చుంటుందా..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.