close
Choose your channels

ఢిల్లీ : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు

Friday, January 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్ వద్ద ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన బీటింగ్ రిట్రీట్‌కు కేవలం కిలో మీటరు దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. పేలుడు ధాటికి మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు ఈ పేలుడు జరిగినట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పందించింది. తామంతా సురక్షితంగానే ఉన్నామని, అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు వెల్లడించారు.పేలుడు నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.