అనుష్క పాత్రలో దీపికా ప‌దుకొనె

  • IndiaGlitz, [Monday,November 04 2019]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి స్టార్ స్టేట‌స్‌ను ఇచ్చిన చిత్రం 'అరుంధ‌తి'. 2009లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది. ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. బాలీవుడ్‌లో అనుష్క పాత్ర‌లో దీపికా ప‌దుకొనె నటిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ముందుగా అనుష్క శ‌ర్మ‌, కరీనాక‌పూర్ వంటి వారి పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ దీపికా అయితే బావుటుంద‌ని మేక‌ర్స్ అనుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన రాలేదు.

ప్ర‌స్తుతం దీపికా చ‌పాక్ చిత్రంలో యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌గా న‌టిస్తుంది. దీనికి మేఘ‌నా గుల్జర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే 83 చిత్రంలో భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ భార్య పాత్ర‌లో న‌టించారు. కాగా.. లేటెస్ట్‌గా మ‌హాభార‌త నేప‌థ్యంలోసాగే చిత్రంలో ద్రౌప‌దిగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

అనుష్క విష‌యానికి వ‌స్తే చాలా గ్యాప్ త‌ర్వాత అనుష్క బాడీ స్లిమ్ చేసుకుని నిశ్శ‌బ్దం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లోన‌టిస్తుంది. ఈ చిత్రంలో ఈమె సాక్షి అనే పాత్ర‌లో న‌టిస్తుంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

More News

బిగ్‌బాస్-3 విన్నర్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి!?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటూ గత మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పక్కా సమాచారం ఎవరైనా లీక్ చేశారా..?

బిగ్‌బాస్ విన్నర్‌పై వస్తున్న పుకార్ల పట్ల నాగ్ క్లారిటీ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ లాస్ట్ డే నేడే. ఇవాళ విన్నర్ ఎవరో..? రన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడక మునుపే ఇదిగో విన్నర్..

ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'మ‌హా స‌ముద్రం'ను ప‌క్క‌న పెట్టేశాడా?

డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. తొలి చిత్రం `RX100`తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే తీసుకుంటున్నాడు.

బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు చేదు అనుభ‌వం

భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల గాంధీజీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన చేంజ్ విత్ ఇన్ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ స్టార్స్‌కే పెద్ద పీట వేశారు. ద‌క్షిణాది తార‌ల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కలేదు.