ప్ర‌భాస్‌కి జోడీగా దీపికా ప‌దుకునే?

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

'బాహుబ‌లి' చిత్రాల‌తో..భార‌తీయ సినిమాపై చెర‌గ‌ని సంత‌కం చేశారు ప్ర‌భాస్‌. ఆ చిత్రాల సంచ‌ల‌న విజ‌యాల‌తో.. ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా నిలిచారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌.. సాహో అనే త్రిభాషా చిత్రాన్ని చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాలో కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప‌రిమితం కాకుండా.. న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో శ్ర‌ద్ధా క‌నిపించ‌బోతోంద‌ని స్వ‌యంగా ప్ర‌భాస్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. సాహో పూర్త‌య్యాక ప్ర‌భాస్ ఓ బాలీవుడ్ మూవీ చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మించే ఈ చిత్రం ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నుంద‌ట‌.

కాగా, ఈ సినిమాలో ప్ర‌ముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఒక‌వేళ ఇది కార్య‌రూపం దాల్చితే.. ఈ కాంబినేష‌న్ ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

More News

ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ లోగో విడుద‌ల‌

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్రలో సినిమాల నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా ఎదిగారనే ఓ అంశాన్ని తీసుకుని ..ఓ బయోపిక్‌ను రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

నాని సినిమాకి మంచి డీల్ కుదిరింది

ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌రుస‌గా ఎనిమిది చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల దండ‌యాత్ర చేశాడు యువ క‌థానాయ‌కుడు నాని. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లుపెట్టి.. గ‌త చిత్రం ఎం.సి.ఎ వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర సాగిస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరో.. అతి త్వ‌ర‌లో కృష్ణార్జున యుద్ధంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు.

బెల్లంకొండ‌కి జోడీగా కీర్తి సురేష్‌?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌.. ఆ త‌రువాత నేను లోక‌ల్‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. తాజాగా వ‌చ్చిన ఆమె మూడో తెలుగు చిత్రం అజ్ఞాత‌వాసి ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ త‌దుప‌రి చిత్రం మ‌హాన‌టిపై పెట్టుకుంది.

25 ఏళ్ల 'ముఠామేస్త్రి'

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. ఆయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు మాస్ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసుకుని రూపొందాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అలాంటి సినిమాల‌లో 'ముఠామేస్త్రి' ఒక‌టి.

క‌ల్యాణ్ పై ఐటీ దాడి...

'జైసింహా' నిర్మాత సి.క‌ల్యాణ్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన త‌ర్వాత ఈ దాడులు జ‌ర‌గ‌డ‌గం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.