close
Choose your channels

బెల్లంకొండ‌కి జోడీగా కీర్తి సురేష్‌?

Wednesday, January 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌.. ఆ త‌రువాత నేను లోక‌ల్‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. తాజాగా వ‌చ్చిన ఆమె మూడో తెలుగు చిత్రం అజ్ఞాత‌వాసి ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ త‌దుప‌రి చిత్రం మ‌హాన‌టిపై పెట్టుకుంది.

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా.. మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రో వైపు త‌మిళంలో విక్ర‌మ్‌, విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది కీర్తి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ యువ క‌థానాయ‌కుడుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా రాజుగారి గ‌ది చిత్రాల ద‌ర్శ‌కుడు ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. స్పోర్ట్స్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కోసం క‌థానాయిక పాత్రకు కీర్తిని సంప్ర‌దించార‌ని.. అలాగే రూ.1.25 కోట్ల పారితోషికం కూడా ఆఫ‌ర్ చేశార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.