ఆ సినిమాను స్టార్ట్ చేసిన దీపిక
- IndiaGlitz, [Friday,February 15 2019]
దీపికా పదుకొనె ఓ బయోపిక్లో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ ప్రముఖ సెలబ్రిటీది మాత్రం కాదు. ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు చిత్ర డైరెక్టర్ మేఘనా గుల్జార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఓ పసుపు చీర పోస్ట్ చేశారు. 'ఛపాక్' సిద్ధమవుతోంది అని రాశారు.
యాసిడ్ దాడి కారణంగా ఈ చీర అక్కడక్కడా కాలిపోయినట్లు కనపడుతుంది. ఈ సినిమాలో దీపిక టైటిల్ పాత్రలో నటించడమే కాదు.. సినిమాను నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ స్క్రిప్ట్ దీపికను ఎంతగానో ఇన్స్పైర్ చేసినట్టు కదా!. రణవీర్తో పెళ్లి తర్వాత దీపిక నటిస్తున్న తొలి చిత్రమిది.